పలివెల 100 స్తంభాల శివాలయం | ఉమాకొప్పులింగేశ్వర స్వామి | కోనసీమ

 పలివెల 100 స్తంభాల శివాలయం – కోనసీమలోని అరుదైన పురాతన దేవాలయం 

పలివెల శివాలయం
Historical temple Konaseema
పలివెల గ్రామంలో ఉన్న 100 స్తంభాల ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం

 

 

 పలివెల గ్రామం – చారిత్రక నేపథ్యం  

       గోదావరి పరివాహక ప్రాంతమైన కోనసీమను పురాతన కాలంలో అనేక రాజవంశాలు పరిపాలించాయి. ఈ ప్రాంతాన్ని పల్లవులు పాలించిన కాలంలో “పల్లవపురం” గా పిలిచేవారని, కాలక్రమంలో అదే పేరు “పలివెల” గా మారిందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.

ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం విశేషాలు

             పచ్చని పంటపొలాల మధ్యలో ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ దేవాలయం 11వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని రాజరాజ నరేంద్రుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
పురాణాల ప్రకారం, కౌసకి నది తీరంలో అగస్త్య మహాముని చేత ఈ శివలింగం ప్రతిష్టించబడిందని విశ్వసించబడుతోంది. 
తూర్పు చాళుక్యుల కాలం నాటి శిల్పకళ
    ఈ దేవాలయంలో తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన శిలాశాసనాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి.
ఆలయంలో చూడదగిన నిర్మాణాలు: పురాతన రాజగోపురం ,గాలి గోపురం ,ఉయ్యాలా మండపం, స్వామివారి మండపం, నిత్యస్థాన మండపం ,చిలుకు ద్వాదశ మండపం,  ఈ మండపాలపై చెక్కబడిన గ్రానైట్ శిల్పాలు, స్తంభాల కళాకృతులు మన భారతీయ చరిత్రకు జీవంత సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 

100 సంవత్సరాలనాటి శాసనాలు ఉన్న స్తంబాలు
పలివెల లో స్తంబాలు

 

 100 స్తంభాల విశిష్టత 

ఈ ఆలయంలోని గ్రానైట్ స్తంభాలు చెక్కుచెదరకుండా ఇప్పటికీ నిలిచి ఉండటం విశేషం.ప్రతి స్తంభంపై ఉన్న శిల్పకళ దర్శనమిచ్చే వారిని మంత్రముగ్ధులను చేస్తుంది.  పలివెల శివాలయంలోని శాసనాలు ఈ ఆలయంలోని శిలాశాసనాలు అప్పటి రాజులు, ఆలయ నిర్మాణ విధానం, దాన ధర్మాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి.ఇవి చరిత్ర పరిశోధకులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.      

 తూర్పు చాళుక్యుల కాలం  నాటి  శిలాశాసనాలు  ఈ ఆలయం లో చూడవచ్చు  .  గ్రానైటు పై చెక్క బడిన శిల్పాలు  , గ్రానైటు స్తంబాలు మనల్ని  ఆకర్షిస్తాయి .  ఈ ఆలయం లో  పురాతన  కాలం  నాటి  రాజగోపురం , ఉయ్యాలా మండపం స్వామివారి మండపము ,నిత్యస్థాన మండపము , చిలుకు ద్వాదశ మండపం వాటిపై కళాకృతులు  మన చరిత్రకు  ఆధారాలుగా  ఉన్నాయి .  ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం  లో  ఉన్న   గ్రానైట్  స్తంబాలు  చెక్కుచెదరకుండా  చూసే వారికీ కనువిందు చేస్తున్నాయి . 

శిలాశాసనాలు పలివెల

పలివెల శివాలయం  లో శాసనాలు
silasasanaalu
Palivela 100 Pillars Shiva Temple


పలివెల గ్రామంలోఉన్న విషేశం ఏమిటంటే గ్రామదేవతకి పుట్టినిల్లు,మెట్టినిల్లు రెండు  దేవాలయాలుఒకేగ్రామంలోఉండటంమనంఈగ్రామంలోచూడవచ్చు.    తాళ్ళమ్మతల్లి  దేవాలయం మరో చోట ఉంది . ఈ తాల్లమ్మ తల్లికి ప్రతి సంవత్సరం ఉగాదికిఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు . 

  ఈ శివాలయానికి ఎలా చేరుకోవాలి
:   
ఈ పలివెల గ్రామం  రావులపాలెం నుండి 12  కిమీ  దూరంలో ఉంది  , కొత్తపేట నుండి 3 కిమీ దూరం లో ఉంది .  అమలాపురం ..25 కిమీ . రాజమండ్రి  నుండి 50 కిమీ దూరం లోను , కాకినాడ నుండి పలివెల 90 కిమీ దూరం లో ఉంది .  

        అమలాపురం  – కొత్తపేట రూట్ లో కొత్త పేట వంతెన వద్ద్దనుంది  పలివెల పురాతన శివాలయానికి చేరుకోవచ్చు . బస్సు సౌకర్యం తక్కువగా ఉంటుంది .  కనుక కొత్తపేట నుండి ఆటో లో సులువుగా
చేరుకోవచ్చు .
  సొంత వాహనాలు ఉంటే  పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ  పలివెల గ్రామాన్ని  చేరుకోవచ్చు  .

gaaligopuram - Palivela
Palivela gopuram
Ancient Shiva Temple in Palivela Village

  ముగింపు 

కోనసీమలో చారిత్రక ప్రాముఖ్యత, అద్భుతమైనశిల్పకళ, గతకాలం నాటి వైభవాలు ఇక్కడి  శాసనాలు బట్టి తెలుసుకోవచ్చు .  100 స్తంభాల ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం తప్పక సందర్శించాల్సిన పుణ్యక్షేత్రం.     భక్తులు, చరిత్ర ప్రేమికులు, పర్యాటకులు అందరికీ ఇది ఒక అరుదైన దర్శన స్థలం.  

మీరు ఒకసారి క్రింద ఉన్న వీడియో ద్వారా పలివెల గ్రామా సౌందర్యం తో పాటు ఈ గుడిని చూడగలరు .

 

 

Leave a Comment