పలివెల 100 స్తంభాల శివాలయం | ఉమాకొప్పులింగేశ్వర స్వామి | కోనసీమ

 

పలివెల 100 స్తంభాల శివాలయం – కోనసీమలోని అరుదైన పురాతన దేవాలయం 

పలివెల గ్రామంలో ఉన్న 100 స్తంభాల ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం


 పలివెల గ్రామం – చారిత్రక నేపథ్యం  

       గోదావరి పరివాహక ప్రాంతమైన కోనసీమను పురాతన కాలంలో అనేక రాజవంశాలు పరిపాలించాయి. ఈ ప్రాంతాన్ని పల్లవులు పాలించిన కాలంలో “పల్లవపురం” గా పిలిచేవారని, కాలక్రమంలో అదే పేరు “పలివెల” గా మారిందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.

ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం విశేషాలు

             పచ్చని పంటపొలాల మధ్యలో ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ దేవాలయం 11వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని రాజరాజ నరేంద్రుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
పురాణాల ప్రకారం, కౌసకి నది తీరంలో అగస్త్య మహాముని చేత ఈ శివలింగం ప్రతిష్టించబడిందని విశ్వసించబడుతోంది. 

తూర్పు చాళుక్యుల కాలం నాటి శిల్పకళ

    ఈ దేవాలయంలో తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన శిలాశాసనాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి.

ఆలయంలో చూడదగిన నిర్మాణాలు:
పురాతన రాజగోపురం
గాలి గోపురం
ఉయ్యాలా మండపం
స్వామివారి మండపం
నిత్యస్థాన మండపం
చిలుకు ద్వాదశ మండపం

ఈ మండపాలపై చెక్కబడిన గ్రానైట్ శిల్పాలు, స్తంభాల కళాకృతులు మన భారతీయ చరిత్రకు జీవంత సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 

పలివెల
శివాలయం లో గాలి గోపురం

Umakoppulingeswara Swamy Temple Konaseema

 100 స్తంభాల విశిష్టత 

  ఈ ఆలయంలోని గ్రానైట్ స్తంభాలు చెక్కుచెదరకుండా ఇప్పటికీ నిలిచి ఉండటం విశేషం.ప్రతి స్తంభంపై ఉన్న శిల్పకళ దర్శనమిచ్చే వారిని మంత్రముగ్ధులను చేస్తుంది.

 పలివెల శివాలయంలోని శాసనాలు ఈ ఆలయంలోని శిలాశాసనాలు అప్పటి రాజులు, ఆలయ నిర్మాణ విధానం, దాన ధర్మాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి.ఇవి చరిత్ర పరిశోధకులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.              

       
       
తూర్పు చాళుక్యుల కాలం  నాటి  శిలాశాసనాలు  ఈ ఆలయం లో
చూడవచ్చు
  .  గ్రానైటు పై చెక్క బడిన శిల్పాలు  , గ్రానైటు స్తంబాలు మనల్ని  ఆకర్షిస్తాయి .  ఈ ఆలయం లో  పురాతన  కాలం  నాటి  రాజగోపురం , ఉయ్యాలా మండపం స్వామివారి మండపము ,నిత్యస్థాన మండపము , చిలుకు ద్వాదశ మండపం వాటిపై కళాకృతులు  మన చరిత్రకు  ఆధారాలుగా  ఉన్నాయి .  ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం  లో  ఉన్న   గ్రానైట్  స్తంబాలు  చెక్కుచెదరకుండా 
 
చూసే వారికీ కనువిందు
చేస్తున్నాయి .
 

పలివెల
శివాలయం
  లో శాసనాలు 

శిలాశాసనాలు పలివెల

Palivela 100 Pillars Shiva Temple

       
 

పలివెల గ్రామం  లో ఉన్న  విషేశం ఏమిటంటే  గ్రామదేవతకి  పుట్టినిల్లు ,మెట్టినిల్లు  రెండు  దేవాలయాలుఒకేగ్రామంలోఉండటంమనంఈగ్రామంలోచూడవచ్చు.     తాళ్ళమ్మతల్లి  దేవాలయం మరో చోట ఉంది . ఈ తాల్లమ్మ తల్లికి ప్రతి సంవత్సరం ఉగాదికిఉత్సవాలు
అంగరంగ వైభవంగా జరుపుకుంటారు .
 

  ఈ శివాలయానికి ఎలా చేరుకోవాలి 
:   
ఈ పలివెల  గ్రామం  రావులపాలెం నుండి  12
కిమీ  దూరం లో ఉంది  , కొత్తపేట నుండి 3 కిమీ దూరం లో ఉంది .  అమలాపురం ..25 కిమీ . రాజమండ్రి  నుండి 50 కిమీ దూరం లోను , కాకినాడ నుండి పలివెల 90 కిమీ దూరం లో ఉంది .  

        అమలాపురం  – కొత్తపేట రూట్ లో కొత్త పేట వంతెన వద్ద్దనుంది  పలివెల పురాతన శివాలయానికి చేరుకోవచ్చు .
బస్సు సౌకర్యం తక్కువగా ఉంటుంది .
  కనుక కొత్తపేట నుండి ఆటో లో సులువుగా
చేరుకోవచ్చు .
  సొంత వాహనాలు ఉంటే  పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ  పలివెల గ్రామాన్ని  చేరుకోవచ్చు  .

Ancient Shiva Temple in Palivela Village

  ముగింపు 

కోనసీమలో చారిత్రక ప్రాముఖ్యత, అద్భుతమైనశిల్పకళ, గతకాలం నాటి వైభవాలు ఇక్కడి  శాసనాలు బట్టి తెలుసుకోవచ్చు .  100 స్తంభాల ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం తప్పక సందర్శించాల్సిన పుణ్యక్షేత్రం.     భక్తులు, చరిత్ర ప్రేమికులు, పర్యాటకులు అందరికీ ఇది ఒక అరుదైన దర్శన స్థలం.  


Leave a Comment